Tuesday, April 23, 2024

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు మృతి

అతివేగంగా వ‌చ్చి విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొని ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న హ‌య‌త్ న‌గ‌ర్ లో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. నగర శివార్లలోని హయత్‌నగర్‌ మండలం పసుమాముల వద్ద బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement