Thursday, April 25, 2024

రెండు బైక్ లు ఢీకొని విద్యార్థి మృతి

రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొని ఓ విద్యార్థి మృతిచెందిన విషాద ఘ‌ట‌న న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్ట‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ మెయిన్ రోడ్ పై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో విద్యార్థి వినేశ్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగద్గిరిగుట్ట ఆంజయ్య నగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement