Friday, March 29, 2024

‘కంటి వెలుగు’ గిన్నిస్ రికార్డ్ సృష్టించడం ఖాయం.. మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘కంటి వెలుగు’ పథకం గిన్నిస్ రికార్డ్ సృష్టించడం ఖాయమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని వివేకానందా కమ్యూనిటీహాల్‌లో కంటివెలుగు శిబిరాన్ని మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఇప్పటికే గిన్నిస్ బుక్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కంటి వెలుగు పథకం అమలుపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పథకాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. అంధత్వ రహితంగా తెలంగాణను మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement