Thursday, April 25, 2024

మేయర్ కు చిత్రపటాన్ని బహుకరించిన ఆర్టిస్ట్

నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖచిత్రాన్ని దిల్ సుఖ్ నగర్ చైతన్యపురికి చెందిన ఆర్టిస్ట్ వెంకటేష్ కందునూరి బహుకరించారు. ఈ చిత్రాన్ని ఏడు రోజుల పాటు పెన్సిల్ తో స్వయంగా చిత్రీకరించి మేయర్ కు అందజేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహిళా మేయర్ గా మహిళలందరికీ ఆదర్శంగా ఉంటూ తనదైన పరిపాలన శైలితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రూపుదిద్ది కార్యాచరణ చేస్తున్నందుకు అభిమానంతో ఫోటో ఫ్రేమ్ ను మేయర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడుతూ సహకరించినందుకు ఆర్టిస్ట్ కు అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement