Friday, April 19, 2024

ఆలయ అభివృద్దికి కృషి..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ డివిజన్ లోని చిక్కడపల్లి వివేక్‌నగర్‌ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్‌ నిర్మాణ ప్రారంభోత్స పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పర్యవేక్షించారు. పునర్‌ నిర్మాణ పనులను ఆలయ ఈవో దేవనాథంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఆలయ పునర్‌ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సుమారు కోటి 20 లక్షల రూపాయల వ్యయం నిర్మాణానికి నిధులు అవసరం అవుతాయని, పూర్తిగా దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి అగ్రిమెంట్‌లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆలయ పునర్‌ నిర్మాణ అనుమతుల కోసం దేవాదాయ శాఖకు ఫైల్‌ పంపడం జరిగిందని, అనుమతులు రాగానే మంచి మూహూర్తం చూసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయం పునర్‌ నిర్మించడం ఆ భగవంతుడి ఆశీర్వాదమేనని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముచ్చకుర్తి ప్రభాకర్‌, ఆకుల శ్రీనివాస్‌, రాకేష్‌కుమార్‌, మారిశెట్టి నర్సింగ్‌రావు, సత్యనారాయణ, దేవాలయం ఇవో దేవనాథం, ఆచారి, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement