Saturday, April 20, 2024

తెలంగాణాలో వైసిపికి షాక్ – ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు రాజీనామా..

హైదరాబాద్‌ : తెలంగాణలో వైసిపికి షాక్ త‌గ‌లింది… తెలంగాణ వైసిపి అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతరం తన రాజీనామా లేఖను ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి పంపారు. ఎపి ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో వైసిపిని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్‌ అంటూ కొనియాడారు. త్వరలోనే తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ పార్టీ తరఫునే హుజుర్‌ నగర్‌ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని తెలిపారు. వైఎస్‌ షర్మిల పార్టీ గురించి మాట్లాడిన ఆయన.. ‘షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నా ఆమెతో విభేదాలు లేవు.. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ అని తెలిపారు. కాగా ఆయ‌న త్వ‌ర‌లోనే బిజెపిలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement