Tuesday, April 16, 2024

యువ‌త‌కు స్వామి వివేకానంద ఆద‌ర్శం : మంత్రి తలసాని

యువ‌త స్వామి వివేకానందను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. కోఠిలో స్వామి వివేకానంద పౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతిలో మంత్రి పాల్గొని.. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చెప్పిన మాటలు, బోధనలు యువత తప్పక చదవి, వారి జీవితాలను గొప్పగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. నేటి యువతకు దేశభక్తి, సమాజ సేవలో స్వామి వివేకానంద ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు బుగ్గారపు దయానంద్‌, వివేకానంద పౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement