Monday, April 15, 2024

HYD: ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

తమ ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో చోటుచేసుకున్నది. చందానగర్‌లోని పాపిరెడ్డి నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సుజాత, నాగరాజు దంపతులు తమ పిల్లలు రమ్యశ్రీ, టిల్లుతో కలిసి పాపిరెడ్డి నగర్‌లో నివాసముంటున్నారు.

అయితే గత మూడురోజులుగా వారి ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడం, పైగా అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇంటి తలుపులు తెరచి చూశారు. దీంతో నలుగురు అప్పటికే మరణించినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement