Thursday, April 25, 2024

కరోనా వైరస్ తో‌ జాగ్రత్తలు..

బాలాపూర్‌ : కరోనా వైరస్‌ ధరిచేరకుండ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి అన్నారు. కరోనాని దరిచేరనీకుండా కాలనీల్లో ఇంటింటికి హైపోక్లోరైడ్‌ రసాయణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసరం పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు. ఆయనతో పాటు గౌరవ శ్రీనివాస్‌, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement