Tuesday, April 16, 2024

కూకట్‌పల్లిలో అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీ ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, మ్యూజిగల్‌ తమ మూడవ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రారంభించింది. కూకట్‌పల్లి (హైదరాబాద్‌)లో ఉన్న అకాడమీ దాదాపు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా సాటిలేని సౌకర్యాలు కలిగి ఉంది. ఇది గాత్రం, వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది. దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన కూకట్‌పల్లిలోని ఈ మ్యూజిక్‌ అకాడమీలో పియానో, కీబోర్డ్‌, గిటార్‌, డ్రమ్స్‌, కర్నాటిక్‌ వోకల్స్‌, హిందుస్తానీ వోకల్స్‌, వెస్ట్రన్‌ వోకల్స్‌ లో బోధన ఉంటుంది.

ఈసంద‌ర్భంగా మ్యూజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ… సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో మ్యూజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దామన్నారు. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుందన్నారు. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం, బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుందన్నారు. పాశ్చాత్య సంగీతంలో మంచి శ్రేణి కోర్సులను ఇది అందిస్తుందన్నారు. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారన్నారు. వీటితో పాటుగా అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement