Thursday, April 25, 2024

పుస్తెమట్టెలు అంద‌జేసిన‌ ఉప్పల శ్రీనివాస్ గుప్తా

నిరుపేద ఓసీ ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పెళ్లికూతురు వివాహానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా పుస్తెమట్టెలు అందజేశారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బొడుప్పల్ నివసిస్తున్న ఆర్యవైశ్య కులానికి చెందిన ధీన పరిస్థితిలో ఉండి రోజువారి కూలీ పని చేసుకొనే యెర్రం జ్యోతి కీ.శే. నర్సింగరావుల కూతురు వైష్ణవి వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా పుస్తెమట్టెలు, చీర, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి.విశ్వేశ్వర్, మహేష్, నరేష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement