Thursday, March 28, 2024

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీక‌రించిన ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామచంద్ర

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని తల్లి జయలక్ష్మితో కలిసి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో ప్రముఖ గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌ విజేత, బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్‌, నటుడు శ్రీరామచంద్ర మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో తన తల్లితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ఒక చెట్టు-కు జీవం పోశామని, ఇది నాతో పాటు పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుందని శ్రీరామచంద్ర అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కి శ్రీరామచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement