Friday, April 19, 2024

200మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులకు చేరిన స్నాప్‌చాట్

భారతదేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్‌చాటర్‌ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్‌లలో భారత్ ఒకటి. ఈసంద‌ర్భంగా ఏపీఏసీ స్నాప్ ఇన్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ మాట్లాడుతూ… మన భారతీయ కమ్యూనిటీలో ఊపందుకుంటున్న సమయంలో తాను స్నాప్‌లో చేరినందుకు థ్రిల్‌గా ఉన్నానన్నారు. స్నాప్‌చాట్‌లో కమ్యూనిటీలు, వ్యాపారాలను నిర్మించడానికి భాగస్వాములు, సృష్టికర్తలు, బ్రాండ్‌లకు అద్భుతమైన సంభావ్య తను తాము చూస్తున్నామ‌న్నారు.

త‌మ భవిష్యత్తు గురించి తాము మరింత ఉత్సాహంగా ఉన్నామ‌న్నారు. భారతదేశంలో స్నాప్‌చాటర్‌లు ప్రతి నెలా 50 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) లెన్స్‌ లు ఉపయోగిస్తారన్నారు. 85శాతంకు పైగా స్నాప్‌చాటర్‌లు భారతదేశంలో పండుగ నెలల్లో తమను తాము దృశ్యమానంగా వ్యక్తీకరించడానికి లెన్స్‌ లను ఉపయోగిస్తున్నారన్నారు. స్నాప్ చాట్ కు గల భారీ సంఖ్యలోని ప్రత్యేకమైన ప్రేక్షకులు, బ్రాండ్-సురక్షిత వాతావరణం, వినూత్న ప్రకటనల పరిష్కారాలు అనేవి బ్రాండ్‌లు, భాగస్వాములకు ఒకే విధంగా విలువైన భాగస్వామిగా మారాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement