Wednesday, April 24, 2024

గాంధీ హాస్ప‌ట‌ల్లో రేవంత్ రెడ్డి నిత్యాన్న‌దానం

హైద‌రాబాద్ – గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల కుటుంబాలు, సహాయకులకు నిత్యాన్నదానం కార్య‌క్ర‌మానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు… ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ, లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండడంతో కరోనా బాధితుల సహాయకులకు తినేందుకు భోజనం దొరకడంలేదన్నారు. వీరి కోసం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గాంధీ కొవిడ్‌ ఆస్పత్రి అయినా కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు ఇతర సిబ్బందికి ప్రభుత్వం ఆహారం ఏర్పాటు చేయలేదన్నారు. ఇక నుంచి ప్రతి రోజూ వెయ్యిమందికి భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement