Thursday, March 28, 2024

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125వ డివిజన్ పరిధిలోని వోక్షిత్ హిల్ వ్యూ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జగదీశ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ రామానాయుడు, ట్రెజరర్ మనోహర రావు, చంద్ర మోహన్, శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ సురేందర్, నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్, నవీన్ యాదవ్, ఎక్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మారెడ్డి, ఐటి వింగ్ కృష్ణ సాగర్, వేణు గోపాల చారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement