Tuesday, April 16, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో చ‌క్క‌గా ప‌నిచేశారంటూ ఎంపి, ఎమ్మెల్యేల‌కు సబిత ప్ర‌శంస‌లు..

హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో పార్టీ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవికి చ‌క్క‌గా ప‌ని చేశారంటూ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎంపికి, ఎమ్మెల్యేల‌ను ప్ర‌శంసించారు.. శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ స‌మావేశ‌మ‌య్యారు.. ఈ స‌మావేశంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి , ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ , చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ , కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు పాల్గొన్నారు..ఇక‌పై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా రానున్న కాలంలో కూడా రెట్టింపు ఉత్సాహం తో పని చేసి జిల్లా అభివృద్ధి లో భాగస్వాములు అవుదాం అంటూ మంత్రి సబితా రెడ్డి ఈ సంద‌ర్భంగా పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement