Thursday, April 25, 2024

కిలిమంజారో ప‌ర్వాతారోహ‌కుడు ఉమేష్ కు ప‌వ‌న్ చిరు స‌త్కారం..

హైదరాబాద్, : ఆఫ్రికాలో అత్యంత ఎత్తు అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పర్వతారోహుడు ఆచంట ఉమేష్‌ను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ను ఉమేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఆయన్ని సన్మానించారు. పర్వతారోహణ కోసం తీసుకున్న శిక్షణ కిలిమంజారో వాతావరణ పరిస్థితులను పవన్‌ కళ్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఉమేష్‌ కిలిమంజారో శిఖరాగ్రాన జాతీయ జెండాను ఎగురవేయ డం ఎంతోమంది యువతకు స్ఫూర్తిని ఇస్తుందని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement