Thursday, April 18, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమ‌ని, చెట్లు నాటడం అంటే దైవకార్యంతో సమానమ‌ని పద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌ డా.పద్మజారెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.పద్మజారెడ్డి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారని, తాను మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. చెట్లు అంటే చాలా ఇష్టమన్నారు. తమ ఇంటి వద్ద, వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో చెట్లు నాటామని గుర్తు చేశారు. మొక్కలు పెరిగి పెద్దయి తల్లిలా చూసుకుంటాయని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వం ఇల్లు కట్టుకునేముందు ప్రతి ఒక్కరూ తమ ఇంటివద్ద చెట్లు నాటాలని ఒక రూల్ తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన స్నేహితులు ప్రతిభ, వనజ, ఉమరాణి కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement