Tuesday, March 19, 2024

పార్కులో విద్యుత్ షాక్ తో ఒకరు మృతి..

పార్కులో విద్యుత్ షాక్ తగలడంతో ఒకరు మృతిచెందిన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని పద్మారావు నగర్ పార్కులో ఉదయం 6-00 గంట‌ల‌కు వాకింగ్ చేసేందుకు ప్రదీప్ (43) అనే వ్య‌క్తి వచ్చాడు. అయితే పార్కులో హై టెన్షన్ కరెంట్ వైర్ తెగి వాకింగ్ ట్రాక్ ఫై పడడంతో వాకింగ్ చేస్తున్న ప్రదీప్ కాలుకు తాకి కరెంట్ షాక్ కొట్టి అక్కడక్కడే స్పాట్లో మృతి చెందాడు. మృతుడు పార్సిగుట్ట బాబూజీ నగర్ కు చెందిన వ్య‌క్తి. అంత పెద్ద హై టెన్షన్ వైరు తెగి పడటానికి కారణమేమిటో తెలియాల్సి ఉంది. దీంతో పెద్ద ఎత్తున మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు, పద్మారావు నగర్ పార్కు దగ్గరికి చేరుకొని న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement