Saturday, April 20, 2024

సికింద్రాబాద్‌లో రోడ్డుప్రమాదం.. యువకుడు మృతి

సికింద్రాబాద్‌లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. జవహర్‌నగర్‌ పరిధిలోని చెన్నాపూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు బైక్‌పై నుంచి కిందపడిపోయారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు యువకులపై నుంచి దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలోని ఆ బీచ్.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్

Advertisement

తాజా వార్తలు

Advertisement