Wednesday, March 27, 2024

ముషీరాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మున్సిపల్ట డివిజన్లలో కనీసవసతులు డ్రైనేజి, మంచినీటి పైప్‌లైన్‌లు, వర్షంనీటి పైప్‌లైన్‌లు పూర్తి చేశామన్నారు. పస్తుతం సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పి ఆండ్‌ టి కాలనీలో సిసి రోడ్డు వేయించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కాలనీ వాసులు సన్మానసభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీలలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించామని, అనుమతులు మంజూరుకాగానే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నామని రానున్న రోజులలో ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అధికశాతం మురికివాడలే ఉన్నాయని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే దశలవారిగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని రాబోయే రోజులలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసిం హా, మహామద్‌అలీ, వై శ్రీనివాస్‌, ఉప్పలయ్య, రవీందర్‌, ముచ్చకుర్తి ప్రభాకర్‌, ఆర్‌ శ్రీనివాస్‌, శ్రావణ్‌, గోవింద్‌, సునిల్‌, కాలనీ వాసులు రామకృష్ణ, లతా, పద్మజ, రాధాకృష్ణ, శైలేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement