Friday, April 26, 2024

మౌంటేరియన్ వెన్నెలకు ఎంపీ జోగినపల్లి అభినందన

హైదరాబాద్ : జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా భానోతు వెన్నెల మాట్లాడుతూ.. తమది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామమని, గిరిజన కుటుంబం అని తనకు చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టమని, అందులో భాగంగా ఈనెల 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించడం కోసం వెళ్ళటం జరుగుతుందని తెలిపారు.

భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వెన్నెలను అభినందిస్తూ.. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తన వంతు సహాయంగా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కుడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement