Friday, April 19, 2024

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు క‌రోనా వ్యాక్సిన్…

హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కరోనా వాక్సిన్ తీసుకున్నారు. నేటి ఉద‌యం నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లిన ఆమెకు మొదటి డోస్ కోవిడ్ టీకాను వైద్యులు వేశారు.. అనంతరం క‌విత మాట్లాడుతూ, వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అంద‌రూ వైద్యుల సూచ‌న‌ల‌కు అనుగుణంగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని పిలుపు ఇచ్చారు. కాగా, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డిలు కూడా ఇదే నిమ్స్ లో వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement