Friday, April 19, 2024

వడ్డెర సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు

హైద‌రాబాద్ లోని ఫతేనగర్ డివిజన్ శాస్త్రి నగర్ లో వడ్డెర కులస్తులకు సంబంధించిన వడ్డెర సంఘం భవనాన్ని కూకట్ ప‌ల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఇచ్చిన హామీ మేరకు కార్పొరేటర్ తన సొంత నిధులతో ఈ భవనంలోని మొదటి అంతస్తుని పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాణ్యతతో కూడిన కమిటీ హాల్ భవనాన్ని నిర్మించి ఇచ్చినందుకు వడ్డెర కులస్తులు ఎమ్మెల్యే కు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement