Thursday, April 25, 2024

ఆర్కే సినీ మ్యాక్స్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మంత్రి తలసాని పరామర్శ

బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ మ్యాక్స్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. గురువారం అపోలో హాస్పిటల్ చేరుకున్న మంత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. అపోలో హాస్పిటల్‌కు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారని… అందులో 9 మంది విద్యార్థులు చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తుతం మరో నలుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాహాని లేదన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలు ఎస్కలేరటర్‌పై ఉత్సాహంగా వెళ్ల‌డంతో.. అనుకోకుండా ఎస్కలేటర్‌పై ఒకరు కింద పడడంతో వెనువెంటనే మరి కొంత మంది కింద పడ్డారని అన్నారు. ప్రస్తుతం పిల్లలతో పాటు టీచర్ కూడా చికిత్స పొందుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement