Friday, March 29, 2024

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ

గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సాయంత్రం జూమ్ మీటింగ్‌లో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి, మల్లు రవి పాల్గొన్నారు. స‌మావేశం ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్ర రాజ‌కీయాల‌పై సాగ‌నుంది. తెలంగాణ‌లో వేగంగా రాజ‌కీయాల్లో మార్పు చోటుచేసుకుంటున్న క్ర‌మంలో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌నున్న‌ట్లు తెస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement