Wednesday, April 17, 2024

నిజాంపేట్‌ కొత్త క‌మిష‌న‌ర్‌కు అభినంద‌న‌లు తెలిపిన మేయ‌ర్ నీలా గోపాల్‌రెడ్డి

నిజాంపేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నూత‌న క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన బి. వంశీకృష్ణ‌ను మేయ‌ర్ కొల‌న్ నీలా గోపాల్‌రెడ్డి శుభాకాంక్ష‌లు చెప్పి సాద‌రంగా ఆహ్వానించారు. కార్పొరేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం మ‌రింత చొర‌వ‌గా ప‌నులు చేప‌ట్టాల‌ని కోరారు. కాగా, కార్పొరేషన్ కార్యాలయంలో నూత‌న క‌మిష‌న‌ర్ వంశీ కృష్ణని నీలాగోపాల్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. మొక్కను బహూకరించి అభినందన‌లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్, NMC అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement