Friday, April 26, 2024

హైద‌రాబాద్ లో భారీ చోరీ : రూ.కోటి విలువైన సొత్తు ఎత్తుకెళ్లిన దొంగలు

రూ.కోటి రూపాయ‌ల విలువైన సొత్తును దొంగ‌లు దోచుకెళ్లిన ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లోని శ్రీ సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో స్టాక్ మార్కెట్ వ్యాపారి అయిన ఫ్లాట్ యజమాని శేఖర్ ఇంట్లో దొంగ‌లు వెళ్లారు. ఆయ‌న తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసేందుకని భార్యతో కలసి ఊరెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లో పడి మొత్తం దోచుకెళ్లారు.

దొంగలు ప్లాట్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. రెండు కిలోల బంగారం, 4కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 25లక్షల నగదు దోచుకెళ్లారు. వీటి మొత్తం విలువ కోటి రూపాయల పైనేనని చెబుతున్నారు. అయితే శంషాబాద్‌లో తమకున్న ఫ్లాట్‌ను ఇటీవల విక్రయించగా వచ్చిన సొమ్మును శేఖర్ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. అలాగే త‌న‌ మిత్రుడు దాచిపెట్టమని ఇచ్చిన రూ.35 లక్షలు కూడా వీరివద్దే ఉన్నాయి. అయితే ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే త‌న మిత్రుని న‌గ‌దు రూ.35 లక్షలను ముట్టుకోని దొంగలు శేఖర్ సొత్తును మాత్రం దోచుకెళ్లారు. ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement