Thursday, April 25, 2024

హైదరాబాద్‌: తన భూమి ఇప్పించాలంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భూమిని సర్పంచ్‌ గుంజుకున్నాడు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి రేడియో టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. తారామతి పేటకు చెందిన కృష్ణ గౌడ్‌.. తన భూమిని గ్రామ సర్పంచ్‌ మూల మహేశ్‌ గౌడ్‌ లాక్కున్నాడని ఆరోపించారు. తనతో సంబంధం లేకుండానే ఇతరులకు అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే అధికారులకు ఫిర్యాదు చేయగా తన సమస్యను పరిష్కరించలేదని వనస్థలిపురంలోని చింతలకుంటలో ఉన్న రేడియో టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ గౌడ్‌ను రేడియో టవర్‌పై నుంచి కిందికి దించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement