Friday, March 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో మాజా తాజా ప్రచారం దిల్‌దార్‌ బనే దే ప్రారంభం

కోకాకోలా ఇండియా దేశీయంగా అభివృద్ధి చేసిన మామిడి పానీయం, మాజా తమ తాజా ప్రచారం దిల్‌దార్‌ బనే దే ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో శుక్ర‌వారం విడుదల చేసింది. ఈ నూతన టీవీసీలో పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన సుప్రసిద్ధ భారతీయ నటి, మోడల్‌ పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈమెతో పాటుగా మహోన్నత నటుడు, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సైతం కనిపించనున్నారు. ఈ నూతన టీవీసీని టీవీ, డిజిటల్‌, రేడియోలో 360 డిగ్రీ విధానంతో ప్రసారం చేయనున్నారు.

ఈసంద‌ర్భంగా కోకా కోలా ఇండియా అండ్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా న్యూట్రిషన్‌ కేటగిరి మార్కెటింగ్ డైరెక్ట‌ర్ అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ… మన దేశపు వారసత్వ బ్రాండ్‌ మజా అన్నారు. 1976 నుంచి ఇది భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా వెలుగొందడంతో పాటుగా భారతదేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో శక్తివంతమైన బ్రాండ్‌గా నిలిచిందన్నారు. సాటిలేని రీతిలో అసలైన, ఆధీకృత మామిడి పళ్ల రుచికి మాజా సుప్రసిద్ధమ‌న్నారు. మామిడి విభాగంలో సుప్రసిద్ధమైన బ్రాండ్ ఇదని, ఈ నూతన పొజిషనింగ్‌తో, ఇప్పుడు తాము బ్రాండ్‌ మహోన్నత కారణాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఔదార్యం, దిల్‌దారికి ప్రతిరూపంగా మారుస్తున్నామ‌న్నారు. బచ్చన్‌, పూజా హెగ్డేలు త‌మతో చేతులు కలుపడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామ‌న్నారు. మాజా మారుతున్న సిద్ధాంతంను వీరు మరింతగా వెలుగులోకి తీసుకురానున్నారని అన్నారు. భారతదేశంలో త‌మకు అత్యంత కీలకమైన మార్కెట్‌లుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా నిలుస్తున్నాయన్నారు. ఈ కారణం చేతనే తాము దిల్‌దారీ ప్రచారం ఇక్కడ నుంచి ప్రారంభించామని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement