Thursday, March 28, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన న‌టి మాధ‌వి ల‌త‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి మాధవి లత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ…. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని కోరారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు చాలా అవసరమ‌ని, చెట్లను కట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీనరి పెంచాలని కోరారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధవి లత ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement