Friday, March 29, 2024

కంటి వెలుగు-2ను విజయవంతం చేద్దాం : మంత్రి హరీశ్ రావు

కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమం ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్‌ పోగ్రామ్‌’గా నిలిచిందని చెప్పారు. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, క్వాలిటీ టీమ్స్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లకు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సారి కోటిన్నర మంతికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌, 25లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకు ముందు 1.54కోట్ల మంతికి పరీక్షలు చేసి, 50లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. గతేడాది ఎనిమిది నెల్లలో కార్యక్రమం నిర్వహించగా.. ఈ సారి వంద పని దినాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలిసారి 827 బృందాలు పని చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు చెప్పారు. బృందాలకు అవసరమైన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని, రెగ్యులర్‌ సర్వీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. డీఎంహెచ్‌ఓలు బాగా పని చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement