Thursday, April 25, 2024

కుట్టుశిక్షణ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ డివిజన్‌లోని చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కేంద్రాన్ని స్థానిక శాసనభ్యులు ముఠా గోపాల్‌, కార్పోరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ కుట్టుశిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పోందుతూ ఆర్ధికంగా అభివృద్ది చెందాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలతోపాటు స్వచ్చంద సంస్థలు పేదల అభివృద్దికి సహాకారం అందించాలని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు జరుపుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కోన్నారు. అనంతరం కార్పోరేటర్‌ పావనీ విన య్‌కుమార్‌ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో రాణించాలంటే ఆర్ధికంగా అభివృద్ది చెందాలని, అప్పుడే రాణీస్తారన్నారు. స్వయం శక్తితో ఆర్ధికంగా అభివృద్ది చెందాలని, అందుకు ఉన్న అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ యవనేత ముఠా జయసింహా, బిజెపి నాయకులు ఏ వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement