Friday, March 29, 2024

నాలాల రిపేర్ల‌లో వేగం పెంచండి….

హైదరాబాద్‌, : గ్రేటర్‌ హైదరాబాద్‌లో నాలా పూడికతీత పనులు, నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత మమ్మరం చేసేందుకు ప్రస జోన్‌కు ప్రత్యే కంగా ఒక చీఫ్‌ ఇంజనీర్‌ను పర్యవేక్షక అధికారిగా నియ మిస్తున్నట్లు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నగరంలో శానిటేషన్‌, రహదారుల అభివృద్ధి, నాలా విస్తరణ కార్యక్రమాలపై నిర్వ హించిన ఈ సమావేశానికి నగర మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి, ఉప మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంట లపాటు సాగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లా డారు. సాధ్యమైనంత అదనపు యంత్రాలు, మానవ వనరు లను ఉపయోగించి పూడిక పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. పూడికతీత పనులు అత్యంత ప్రాధాన్యతగల పనుల్లో చేరుస్తూ పనులకుగానూ నిధులు విడుదల చేసేదుకు ప్రత్యే కంగా గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశిం చారు. నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాలలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరా శ్రయులైన వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వెంటనే కేటా యించాలని ఆదేశించారు. నాలా విస్తరణ, అడ్డంకుల తొల గింపు పనులకు సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో స్వల్ప కాలిక పనులను పరిపాలన సంబంధిత అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
నగరంలో లింక్‌ రోడ్ల నిర్మాణం, సీఆర్‌ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణకై రూ.2800 కోట్ల విలువైన టీడీఆర్‌ లను అందజేయడం దేశంలో మరే నగరంలో జరగలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డిలను మంత్రి అభినందించారు.
మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్‌ నగరం దేశంలోని ఇతర నగరాల కన్నా ముందంజలో ఉందని, దీనిలో భాగంగా ఎన్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో చేపట్టిన దాదాపు 21 ప్రాజెక్టులు నగర వాసులకు అందుబాటులోకి వచ్చాయని, మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయని వెల్లడించారు. నగరం లోని చెరువులను సుందర తటాకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను మంత్రి కోరారు.
శానిటేషన్‌పై అధికారులకు మార్గదర్శకాలు
నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై మరిం త శ్రద్ధ చూపించాలని, ఈ విషయంలో జోనల్‌ కమిషనర్లు ప్రతిరోజూ ఉదయం వేళలో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శానిటేషన్‌ కార్యక్ర మా లపై ఆడిట్‌ నిర్వహించాలని తెలిపారు. ప్రతి సర్కిల్‌లో ఎన్ని నివాసాలున్నాయి, శానిటేషన్‌ స్టాఫ్‌ ఎంత మంది ఉన్నారు, ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్చ ఆటోలున్నాయి, అదనంగా ఎన్ని కావాలి తదితర అంశాలపై ఈ ఆడిట్‌ నిర్వ హించాలని కోరారు. గతంలో ఉన్న పరిచయం, సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్‌ ఆదేశించారు. నగర పౌరుల సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
జోనల్‌ కమిషనర్‌లపై మంత్రి ఆగ్రహం
జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ల మీద మంత్రి సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. రోడ్ల మీద రోజుల తరబడి చెత్త పేరుకు పోవడంపై ఇటీవల ట్విట్టర్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన అధికారులను మందలించినట్లు సమా చారం. టాయిలెట్స్‌ తీరుపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాటిని నిర్వహించే కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు తెెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement