Thursday, April 25, 2024

కేసీఆర్..కేటీఆర్ కోసం ప్రత్యేక పూజలు..

కవాడిగూడ : కరోనా వైరస్‌ నివారణకు సామాజిక దూరం పాటించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల జేఏసి రాష్ట్ర కన్వీనర్‌ పులిగారి గోవర్దన్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కవాడిగూడలోని శ్రీ సంకట విమెచన హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణకు అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌లో పాటు రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం భగవంతున్ని కోరుతున్నానన్నారు. అందుకు ప్రతిఒక్కరు సామాజిక దూరం, స్వయ నియంత్రణ, పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌ ధరించడం, శాని టైజర్‌ వాడడం అలవాటుగా చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా తగ్గే వరకు అందరూ ఇండ్లకే పరిమితమై కరోనా వైరస్‌ నివారణకు సహాకరించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement