Thursday, April 25, 2024

కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ రోడ్ అండ‌ర్ బ్రిడ్జిని ప్రారంభించిన కెటిఆర్..

హైద‌రాబాద్ : కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండ‌ర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. కాగా, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి రావ‌డంతో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొల‌గిపోనున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్ప‌నున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement