Friday, April 19, 2024

తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో కృష్ణంరాజుది చెర‌గ‌ని ముద్ర : మంత్రి కేటీఆర్‌

ప్ర‌ముఖ న‌టుడు కృష్ణంరాజు భౌతికకాయానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు. జీవించినంత కాలం అందరినీ కలుపుకొని వెళ్లారన్నారు. ప్రభుత్వ లాంఛనలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం కృష్ణంరాజుకు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement