Monday, April 15, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయం.. లోకేష్ కుమార్

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయ‌మ‌ని జిహెచ్ఎంసి కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ‌ జయంతి సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవ చేశారని, అంతేకాకుండా తెలంగాణ సాధన కోసం తనదైన పాత్ర పోషించారని కమిషనర్ అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయ లక్ష్మి, జయరాజ్ కెన్నెడీ, యాదగిరి రావు చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, సెక్రెటరీ లక్ష్మి, ఓయస్ డి అనురాధ సీపీఅర్ ఓ మొహమ్మద్ మూర్తుజా, పీఆర్ఓ జీవన్, రమణ, అంబర్ పేట్ ఏఎంహెచ్ఓ జ్యోతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement