Thursday, April 25, 2024

జర్నలిస్ట్ రఘు కేసు: తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

జర్నలిస్ట్ రఘుపై అక్రమ కేసులు పెట్టారని, వాటిని వెంటనే కొట్టివేయాలంటూ రఘు భార్య లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. రఘు బెయిల్ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ ఉన్నందున కేసుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ కోరింది.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ రఘుపై నమోదు చేసిన కేసుల వివరాలు సమర్పించాలని తెలంగాణ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 14లోగా కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసుల వివరాల కోసం డీజీపీకి వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతి పత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 16కి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement