Friday, April 19, 2024

బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ సముచిత గౌరవం: మంత్రి తలసాని

బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి నూతనంగా చైర్మన్ గా నియమితులైన సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా అధిక ప్రాధాన్యత కల్పించేలా చట్టసభల్లో, నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీల్లో గతంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement