Saturday, April 20, 2024

దివ్యాంగుల‌కు అండ‌గా ఎమ్మెల్సీ క‌విత‌…

ఏడుగురు దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను అందజేసిన ఎమ్మెల్సీ
సోషల్‌ మీడియా ద్వారా తమ సమస్యలను కవిత దృష్టికి తీసుకువెళ్లిన దివ్యాంగులు
వెంటనే స్పందించిన కవిత

హైదరాబాద్‌, : ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకు న్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూ టీని అందించి, ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింపారు. హైదరాబాద్‌ పురానాపూల్‌కు చెందిన సూర్యప్రకాశ్‌, కుత్బుల్లాపూర్‌కు చెందిన సయ్యద్‌ సలీం, సిరిసిల్లకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌, శేఖర్‌, ఖానాపూర్‌కు చెందిన సుధాకర్‌, వరంగల్‌ రూరల్‌కు చెందిన భరత్‌, షబానాలు వీధి వెక్కరించి దివ్యాంగులుగా మారారు. తమ పరిస్థితి సోషల్‌ మీడియా ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లి సాయం చేయాలని కోరారు. ట్విట్టర్‌ ద్వారా దివ్యాంగుల దీనస్థితి గురించి తెలుసుకున్న కవిత వెంటనే స్పందించారు. వారితో నేరుగా మాట్లాడిన కవిత అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏడుగురు దివ్యాంగులు .. కవితను కలిశారు. ఈ సందర్భంగా ఏడుగురు దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను అందించారు. అంతేకాదు ఎప్పడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి భరోసానిచ్చారు. కోరిన వెంటనే స్పందించి సాయం అందించిన కవితకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.

https://twitter.com/HasiniBangaram/status/1377842689740218369
Advertisement

తాజా వార్తలు

Advertisement