Saturday, April 20, 2024

మూడు తరాల ఉద్యమ వారధి జయశంకర్ .. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

మూడు తరాల తెలంగాణ ఉద్యమ వారధి, తెలంగాణ సిద్దంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని టూరిజం కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ మహనీయుడుకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రొఫెసర్ జయశంకర్ సర్ కలలు కన్న ఆశయాలను నెరవేరుస్తూ వారి నినాదం ప్రకారం నీళ్లు, నిధులు, నియామకాల ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైన సంక్షేమ పథకాలను ఇస్తుందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కేసీఆర్ కు వెన్నంటి ఉండి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ కలగన్న బంగారు తెలంగాణతో కేసీఆర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారన్నారు. నిష్కల్మష తెలంగాణ వాది, నిరాడంబరుడు, మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి సందర్భంగా వారికి నివాళులన్నారు. మహాత్మా మీరు చూపిన దారిలో బంగారు తెలంగాణ నిర్మాణానికి కోసం పని చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement