Wednesday, April 24, 2024

ఈ రూట్లలో ట్రాఫిక్ కు అంత‌రాయం..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.16 గంటలకు ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బంజారాహిల్స్‌ మార్గాల్లో ట్రాఫిక్‌కు అతరాయం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌-తెలంగాణ భవన్‌ మార్గం, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-ఫిలింనగర్‌ రూట్‌, మాసబ్‌ట్యాంక్‌-బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12, తాజ్‌కృష్ణ-మాసబ్‌ట్యాంక్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ స్తంభించే అవకాశం ఉందని చెప్పారు. ట్రాఫిక్‌ దృష్ట్యా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement