Friday, April 19, 2024

స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద : శ్రీల‌త శోభ‌న్ రెడ్డి

భారతదేశాన్ని జాగృతం చేసిన మహనీయులు, స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బుధవారం లాలాపేట్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు ఇంగ్లాండ్, అమెరికాలో యోగ వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, మంత్రి వినోద్, సునీల్ ముదిరాజ్, అంజి, బాలరాజు, కృష్ణ స్వామి, మంజుల, పద్మ, బాబు, జూపల్లి శ్రీనివాస్, వనజ, కళ్యాణి, ఆలీ, సాదిక్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement