Thursday, April 25, 2024

నేడు భార‌త్ VS న్యూజిలాండ్ వ‌న్డే మ్యాచ్

భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఈరోజు తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఇవాళ జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగబోతుంది. హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇప్ప‌టికే శ్రీలంక జ‌ట్టుపై గెలిచి సిరీస్ గెలుచుకున్న టీమిండియా జ‌ట్టు న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్ కూడా గెల‌వాల‌నే ప‌ట్టుతో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement