Friday, April 26, 2024

ఐ లవ్‌ సికింద్రాబాద్‌, రైల్వే స్టేషన్‌లో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : ప్రయాణికులకు వినోదాన్ని, ఉత్సాహాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టే షన్‌లో ఐ లవ్‌ సికింద్రాబాద్‌ పేరిట సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని కలిగించడానికి స్టే షన్‌లోని ప్లాట్‌ ఫాం-10 వద్ద ఈ థీమ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 1.5 లక్షలమంది ప్రయాణికులు ప్రతిరోజు రాకపోకలు సాగించే అతిపెద్ద రైల్వేస్టే షన్‌ను మరింత సుందరంగా తీ ర్చిదిద్దే చర్యల్లో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఐకానిక్‌ టైపోగ్రాపికల్‌ స్కల్చర్‌ రాత్రి వేళల్లో ప్రకాశవంతమైన మెరుపులతో స్టే షన్‌ వైభవాన్ని మరింత పెంచుతుందని వారు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఐకానిక్‌ థీమ్‌ వద్ద ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement