Wednesday, April 24, 2024

ఇంత దౌర్జన్యమా.. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన నివాసంలో ఐటీ దాడులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొడుకు ఆస్పత్రి పాలైతే చూడనివ్వలేదన్నారు. ఐటీ అధికారులు మోసం చేశారని అన్నారు. ఐటీ అధికారులు తమ సంతకం తీసుకుంటామని.. తమ కొడుకు చేత సంతకం చేయించుకున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఉండవా అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు తనపై కుట్ర పన్నారన్నారు. కొడుకు ఆస్పత్రిలో ఉన్నా కనికరం చూపలేదన్నారు. తమ దుమ్మంతా దులిపేశారన్నారు.

తమ పెద్ద కొడుకును మానసికంగా వేధించి సంతకం పెట్టించారన్నారు. ఏదైనా దొరికితే చూపించాలి కదా అన్నారు. రూ.100కోట్ల బ్లాక్ మనీ ఉందని సంతకం పెట్టించుకున్నారన్నారు. లేని డబ్బును ఎక్కడ చూపించాలని అన్నారు. పార్ట్ 1 అయ్యింది.. పార్ట్ 2, 3 ఇంకా ఉందన్నారు. ఇంకా మూడు నెలలు వేధిస్తూనే ఉంటారన్నారు. ఆయకార్ భవన్ లో ఇంకా సినిమా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement