Thursday, April 25, 2024

కెసిఆర్ చిత్ర‌పటానికి హోం గార్డ్స్ క్షీరాభిషేకం….

హైద‌రాబాద్ – ప్రభుత్వ ఉద్యోగస్తులతో స‌మానంగా పీఆర్సీతోపాటు హోంగార్డ్స్కు 30 శాతం జీతం పెంచిన సంద‌ర్భంగా సైబరాబాద్ హోంగార్డ్సు రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు..ఈ సంద‌ర్భ‌గా లో సైబరాబాద్ హోంగార్డ్స్ అధ్యక్షులు అశోక్ కుమార్ ఉప అధ్యక్షులు జంగయ్య బుచ్చయ్య బి గోపాల్ శేఖర్ పటేల్ కాసిము జమాల్ ఖాన్ రవి త‌దిత‌రులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హోంగార్డుల జీతాలు ఆరు వేలు మాత్రమేన‌ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన త‌ర్వాత కెసిఆర్ రూ 12000 వేల వేతనం పెంచడం జరిగింద‌న్నారు.. ఈ జీతాలతో బతకడం చాలా కష్టం అని తెలుసుకుని మళ్లీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిలిచే 20.000 వేల వేతనం పెంచార‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ కు మంచి వేతనం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ కుటుంబాలు రుణపడి ఉంటాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement