Wednesday, March 27, 2024

హోమం జరిపిన కార్పొరేటర్ దంపతులు..

అల్వాల్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ అల్వాల్‌సర్కిల్‌ మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌ జితేంద్రనాథ్‌ ప్రత్యేక గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈమేరకు అల్వాల్‌లోని ఆయన నివాసంలో రాజ్‌జితేంద్రనాథ్‌ కుటుంబసభ్యులతో కలసి ఇట్టి హోమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సంక్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలన్న సంకల్పంతో ఇట్టి గణపతి హోమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికే అల్వాల్‌సర్కిల్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాలతో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా పటిష్టమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాజ్‌జితేంద్రనాథ్‌ వెల్లడించారు. మచ్చబొల్లారం, అల్వాల్‌, వెంకటాపురం డివిజన్‌లలో ఇప్పటికే కార్యచరణ ప్రకారం కార్పోరేటర్‌లు ముందుకెళుతున్నారని, కోవిడ్‌-19 బారి నుంచి ప్రజలకు విముక్తి లభించేలా ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకొంటున్నామని ఆయన వివరించారు. ఈతరుణంలో ప్రజలు సైతం తమతమ బాధ్యతల్ని విధిగా నిర్వర్తిం చాలని సూచించారు. ప్రధానంగా మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలని రాజ్‌జితేంద్రనాథ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ చర్యలకు మద్దతుగా నిలవాలని, అర్హత గల వారందరూ కోవ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని ఆయన తెలిపారు. ఇట్టి హోమంలో రాజ్‌జితేంద్రనాథ్‌ కుటుంబసభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement