Wednesday, April 24, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల‌ వద్ద రూ.3 కోట్ల విలువ చేసే 5.5 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ఇద్దరు ప్రయాణీకుల ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. లోదుస్తుల్లో దాచిన బంగారం గుట్టును అధికారులు రట్టు చేశారు. బంగారం సీజ్ చేసి, ఇద్దరిపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement